Gurukula Schools: బీసీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:36 AM
అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-05లో నాలుగో తరగతి చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల సంక్షేమ పాఠశాలల్లో 2025-26కి గాను 6,600 సీట్లతో ఐదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-05లో నాలుగో తరగతి చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ జిల్లాలో దరఖాస్తు చేస్తే, విద్యార్థులు ఆయా జిల్లాల్లో చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 11 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 12 ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష మించి ఉండకూడదు.