నర్సీపట్నం ఆస్పత్రికి అధునాతన అంబులెన్స్
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:44 AM
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి ఆసుపత్రికి అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కొనుగోలు కోసం ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.35 లక్షలు కేటాయించారు.

సీఎస్ఆర్ కింద రూ.35 లక్షలు ఇచ్చిన ఎన్టీపీసీ
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి ఆసుపత్రికి అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కొనుగోలు కోసం ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.35 లక్షలు కేటాయించారు. ఈ మేరకు చెక్కును ఎన్టీపీసీ సింహాద్రి ఈడీ సమీర్శర్మ గురువారం కలెక్టర్ విజయకృష్ణన్ను ఆమె చాంబర్లో కలిసి అందజేశారు. సామాజిక బాధ్యత కింద అంబులెన్స్ కొనుగోలుకు నిధులు ఇవ్వడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సింహాద్రి ప్రతినిధులు ప్రసేన్జిత్ పాల్, బీబీ పాత్ర, కె.ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.