RBI: రూ.500, రూ.10 నోట్లకు సంబంధించి కీలక అప్డేట్..ఈ విషయం మీకు తెలుసా
ABN , Publish Date - Apr 04 , 2025 | 09:28 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో రూ.10, రూ.500 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం చేస్తారు. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.

దేశానికి కొత్త ఆర్బీఐ(RBI) గవర్నర్ వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల వార్త వెలుగులోకి వచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గిందని, దీంతో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. మరోవైపు 10 రూపాయలు, 500 రూపాయల నోట్లకు సంబంధించి RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.10, రూ.500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది.
చట్టబద్ధంగా చెలామణి..
ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లోని రూ. 10, రూ. 500 నోట్లను పోలి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నోట్లను జారీ చేసినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన రూ.10, రూ.500 డినామినేషన్లలోని అన్ని (పాత) నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. గవర్నర్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను కూడా విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. మల్హోత్రా డిసెంబర్ 2024లో RBI గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆరు సంవత్సరాలు గవర్నర్గా పనిచేసిన శక్తికాంత దాస్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
9న రెపో రేటు ప్రకటన..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఏప్రిల్ 7 నుంచి మొదలు కానుంది. ఏప్రిల్ 9న ఆర్బీఐ గవర్నర్ పాలసీ రేటును ప్రకటిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మొదటి సమావేశం కాబట్టి, దీనిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమావేశంలో రెపో రేటులో 0.25% కోత చూడవచ్చు. ఇదే జరిగితే రెపో రేటు వరుసగా రెండోసారి తగ్గుతుంది. ఆ తర్వాత రెపో రేట్లు 6 శాతానికి తగ్గుతాయి. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది. ఫిబ్రవరిలో, ఆర్బీఐ గవర్నర్ 0.25 శాతం కోతను ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్లో పర్సనల్ లోన్స్పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News