UPI Rewards: యూపీఐ లావాదేవీలపై బహుమతులు..వీరికి మంచి ఛాన్స్
ABN, Publish Date - Mar 19 , 2025 | 09:14 PM
దేశంలో UPI ఆధారిత లావాదేవీలు వేగంగా పెరిగిపోతున్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో మాత్రం పెరగడం లేదు. ఈ క్రమంలోనే చిన్న స్థాయి వ్యాపారులు, దుకాణదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వృద్ధి క్రమంగా పెరిగిపోతుంది. ప్రత్యేకంగా UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. ఇది ప్రజలకు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు సహాయపడుతుంది. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా UPI సేవలు అంతగా విస్తరించలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం UPI లావాదేవీలను మరింత ప్రోత్సహించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
లావాదేవీల ప్రోత్సాహక పథకం
ఈ క్రమంలో భారత ప్రభుత్వం దేశంలో UPI లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు 1500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా రూ. 2000 కంటే తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీలపై మరింత ప్రోత్సాహకాలు అందించబడతాయి. ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చిన్న వ్యాపారులకు ఉత్సాహాం
ప్రతి UPI లావాదేవీపై 0.15% వడ్డీని ప్రోత్సాహకంగా ఇవ్వడం ద్వారా, చిన్న వ్యాపారులు, దుకాణదారులు సులభంగా డిజిటల్ లావాదేవీలను చేసుకుంటారు. ఇది ప్రత్యేకంగా చిన్న వ్యాపారులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పథకం 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఒక చిన్న వ్యాపారి UPI ద్వారా రూ. 1500 స్వీకరించినప్పుడు, వారికి 0.15% చొప్పున రూ. 2.25 ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే ఈ స్కీం గడువు మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో మళ్లీ పెంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
డిజిటల్ చెల్లింపుల సంఖ్య
ఈ పథకం చిన్న వ్యాపారాలు, దుకాణదారుల కోసం రూపొందించబడింది. దీని ద్వారా, చిన్న వ్యాపారులు మరింత UPI లావాదేవీలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక దుకాణదారుడు UPI ద్వారా రూ. 1500 తీసుకుంటే, అతనికి రూ. 2.25 ప్రోత్సాహకం అందుతుంది. ఈ నిర్ణయం ద్వారా వ్యాపారులు అంగీకరించే డిజిటల్ చెల్లింపుల సంఖ్య పెరుగుతుందని, వ్యాపారాల్లో మరింత పారదర్శకత రాబోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
లావాదేవీలను ట్రాక్ చేయడం
ఈ క్రమంలో ప్రభుత్వ ప్రోత్సాహక పథకం యూపీఐ వినియోగాన్ని మరింత పెంచడంలో సహాయపడే అవకాశం ఉంది. ప్రధానంగా, చిన్న వ్యాపారాలు, రిటైల్ షాపులు, పలు సేవల సంస్థలు ఈ పథకంలో భాగస్వామ్యం కావచ్చు. UPI ద్వారా పేమెంట్స్ వేగంగా చేయడం వల్ల వ్యాపారాలు తక్షణం నగదు అందుకోవచ్చు. అలాగే లావాదేవీలను ట్రాక్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది. దీని వల్ల వ్యాపారాల్లో ఎటువంటి అనుమానాలు లేకుండా డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయి. ఈ ప్రోత్సాహక పథకం కింద, దుకాణదారులు రూ. 2000 కంటే తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీలపై ప్రభుత్వం వారి ఖర్చులను భరిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Credit Card: ఓర్నీ..క్రెడిట్ కార్డ్ వద్దని బ్లాక్ చేసినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 19 , 2025 | 09:14 PM