CBSE: ఈ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం..
ABN, Publish Date - Feb 25 , 2025 | 08:52 PM
10వ తరగతి విద్యార్థులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై ఏడాదికి ఒకసారి నిర్వహించే బోర్డు పరీక్షలకు బదులు, రెండు సార్లు నిర్వహిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి విద్యార్థుల పరీక్షా విధానంలో కీలక సంస్కరణ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది 2026 నుంచి టెన్త్ బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ముసాయిదాను CBSE ఆమోదించింది. ఈ క్రమంలో CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి-మార్చిలో జరగనుండగా, రెండో దశ మే 2026లో జరుగుతుంది.
కొత్తగా ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం 10వ తరగతి బోర్డు పరీక్షలు రెండు దశల్లో నిర్వహించబడతాయి. రెండు విడతల్లో పరీక్షలు మొత్తం సిలబస్ను కవర్ చేస్తాయి. ఆ క్రమంలో విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేస్తారు. దీనివల్ల విద్యార్థులు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త పరీక్షా వ్యవస్థకు సంబంధించిన ముసాయిదా విధానాన్ని CBSE అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/cbsenew/cbse.html అప్లోడ్ చేశారు. ఈ విధానాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు ప్రభుత్వం మార్చి 9లోగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి సూచనలను కోరింది.
కొత్త పరీక్షా విధానం లక్ష్యం ఏంటి..
విద్యార్థులు మొదటి పరీక్షలో బాగా రాణించలేకపోయినా కూడా, రెండోసారి నిర్వహించే పరీక్షలో మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది
దీంతోపాటు ఒకేసారి పరీక్ష రాయాలనే ఒత్తిడి కూడా విద్యార్థులకు తగ్గుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం పొందుతారు
విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది కాబట్టి, తమ బలహీనతలను గుర్తించుకోవడం ద్వారా తదుపరి పరీక్షలో మెరుగ్గా రాణించవచ్చు
కొత్త వ్యవస్థ ఎప్పటి నుంచి అమలవుతుంది..
ఈ కొత్త వ్యవస్థను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మార్పు ద్వారా విద్యార్థులకు మేలు చేస్తుందని, విద్యా వ్యవస్థను మరింత సరళంగా మారుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ CBSEతో చర్చలు జరిపింది.
ఈ క్రమంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ భేటీ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతోపాటు ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి కూడా సలహాలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఒత్తిడిలేని వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల స్పందన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ ఈ విధానంలో మరిన్ని మార్పులు చేయనుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 25 , 2025 | 09:41 PM