BJP Record Donations: బీజేపీకి రూ.2,243కోట్ల విరాళాలు
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:06 AM
2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.2,243 కోట్ల విరాళాలు అందాయి. ఈ మొత్తంలో 88% నిధులు బీజేపీ ఖాతాలోనే చేరాయి, వీరిలో 3,478 మంది కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఉన్నారు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి విరాళాల వరద పోటెత్తింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీకి ఏకంగా రూ.2,243 కోట్ల మేరకు విరాళాల రూపంలో నిధులు అందాయి. అన్ని జాతీయ పార్టీలకు కలిపి అందిన విరాళాల్లో 88ు నిధులు ఒక్క బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. 8,358 మంది నుంచి రూ.2,243 కోట్ల విరాళాలు కమలం పార్టీకి లభించాయి. వీరిలో 3,478 మంది కార్పొరేట్ దిగ్గజాలు, వ్యాపార వేత్తలే ఉండడం గమనార్హం. బీజేపీకి అందిన మొత్తం విరాళాల్లో వీరి వాటా రూ.2,262.55 కోట్లు కావడం విశేషం. ఇక, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రూ.281.48 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో సమకూరాయి. ఈ ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం జాతీయ పార్టీలకు మొత్తం రూ.2544.28 కోట్లు విరాళాలుగా అందాయి. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.723.675 కోట్లు విరాళంగా ఇచ్చింది. కాగా, కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన వివరాలను బీజేపీ దాచినట్టు ఏడీఆర్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
For National News And Telugu News