Share News

Justice BV Nagarathna: విడాకుల కేసుల్లో మధ్యవర్తిత్వమే మేలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:47 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి. నాగరత్న, విడాకుల కేసుల్లో ముందుగా మధ్యవర్తిత్వం జరపాలని సూచించారు. అది విఫలమైతేనే కేసు విచారణకు వెళ్లాలని అన్నారు

Justice BV Nagarathna: విడాకుల కేసుల్లో మధ్యవర్తిత్వమే మేలు

  • విఫలమైతేనే విచారణ వరకు వెళ్లాలి

  • జస్టిస్‌ బి.వి.నాగరత్న సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల విడాకుల కేసుల్లో తొలుత మధ్యవర్తిత్వం జరపాలని, అది విఫలమయితేనే విచారణ వరకు వెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి. నాగరత్న సూచించారు. శనివారం బెంగళూరులో ‘భారత సమాజానికి కుటుంబమే పునాది’ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆమె ప్రసంగిస్తూ కుటుంబ న్యాయస్థానంలో కేసు విచారణకు రాక ముందే తప్పనిసరిగా మధ్యవర్తిత్వం జరగాలన్నారు. కోర్టులో తొలుత వాదనలు జరిగితే దంపతుల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఫ్యామిలీ కోర్టుల్లో శిక్షణ పొందిన నిపుణులు లేదా విశ్రాంత న్యాయమూర్తులు మధ్యవర్తులుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి సాధించడం దాంపత్య జీవితాల విచ్ఛిన్నానికి కారణమవుతోందన్నది కేవలం అపోహ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. అది ఏ మాత్రం సరికాదని చెప్పారు. గత పదేళ్లలో జరిగిన వివాహాల్లో సుమారు 40 శాతం విడాకులకు దారి తీశాయని ఇటీవలే ఒక సర్వేలో తేలిందని గుర్తు చేశారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరిపై మరొకరు గౌరవం కలిగి ఉండాలని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:47 AM