Waqf Bill Protest: కోర్టులో సవాలు చేస్తాం
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:22 AM
వక్ఫ్ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. బిల్లును ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని వెల్లడించింది

ముస్లిం పర్సనల్ లా బోర్డు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: వక్ఫ్ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ప్రకటించింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఏఐఎంపీఎల్బీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఏఐఎంపీఎల్బీ సభ్యుడు ఎండీ అబీద్ మాట్లాడుతూ ఆ ‘నల్ల చట్టానికి’ వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ బిల్లును ముస్లింల ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. ‘ఈ పోరాటంలో మనం ఓడిపోయామని భావించొద్దు. మనం ఇప్పుడే ప్రారంభించాం. ఇది దేశాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటం. ఎందుకంటే భారతదేశ మౌలిక స్వభావానికే ముప్పుగా ప్రతిపాదిత చట్టం ఉంది’ అన్నారు. మనస్సాక్షిగల పౌరులందరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. బిల్లును ఉపసంహరించుకునే వరకూ విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు. రైతులు చేసినట్టే తామూ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని, అవసరమైతే రోడ్లను దిగ్బంధిస్తామని ఏఐఎంపీఎల్బీ ఉపాధ్యక్షుడు అలీ మొహిసిన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్
Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే
Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
For National News And Telugu News