DK Shivakumar: కులగణన నివేదిక అమలుపై కంగారు లేదు
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:37 AM
కర్ణాటకలో కులగణన నివేదిక అమలుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు. అమలులో హడావుడి నిర్ణయాలు ఉండబోతోన్నాయి, ఆ క్రమంలో 17వ తేదీకి ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు

హడావుడి నిర్ణయాలు ఉండవు: డీకే శివకుమార్
బెంగళూరు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కులగణన నివేదికను శుక్రవారం కేబినెట్ స్వీకరించిదని, అమలు విషయంలో కంగారు లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నివేదికపై రాజకీయ విమర్శలు ఉన్నాయని, అమలు విషయంలో హడావుడి నిర్ణయాలు ఉండబోవన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా అన్ని కులాలకు న్యాయం చేయదలిచామన్నారు. మంత్రులకు నివేదిక ప్రతులు చేరాయని, సమగ్రంగా అధ్యయనం చేసి ఈ నెల 17న చర్చించేందుకు ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఇదే విషయమై సీఎం సిద్దరామయ్య శనివారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ.. నివేదిక స్వీకరించామని, 17న జరిగే కేబినెట్ తర్వాత స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం బీసీలకు 32శాతం రిజర్వేషన్ ఉందని, నివేదిక సిఫారసు ప్రకారం 52 శాతానికి పెరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 7శాతంతో కలిపి రిజర్వేషన్లు 75శాతానికి చేర్చాలని సిఫారసులు ఉన్నాయి. కాగా.. కులగణన నివేదికను రాష్ట్రంలో బలమైన సామాజికవర్గమైన వీరశైవలింగాయతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నివేదిక ప్రకారం రాష్ట్రంలో ముస్లింలు 75.25 లక్షల మంది ఉన్నారు. దీంతో ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్ 8 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For National News And Telugu News