Share News

Supriya Shrinate: 'ఆమ్ ఆద్మీని గెలిపించే బాధ్యత కాంగ్రెస్‌పై లేదు'

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:58 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలుపు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాటే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

  Supriya Shrinate: 'ఆమ్ ఆద్మీని గెలిపించే బాధ్యత కాంగ్రెస్‌పై లేదు'
Supriya Shrinate

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం కాంగ్రెస్ బాధ్యత కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాటే (Supriya Shrinate) అన్నారు. ఢిల్లీలో మేము గత 15 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం. మేము ఏ సందర్భంలోనూ ఆప్‌ను గెలిపించే బాధ్యతను స్వీకరించలేదన్నారు. మా బాధ్యత ప్రజల ముందు ఉత్సాహంగా ప్రచారాన్ని నిర్వహించడం, ఈ ఎన్నికలలో బలంగా పోటీ చేయడమేనని చెప్పారు.


ఈ నేపథ్యంలో ఆప్ గెలిచే దిశగా ఉన్న వ్యూహాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అరవింద్ కేజ్రీవాల్ గోవా, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్ ఇలా అనేక రాష్ట్రాల్లో పోటీకి వెళ్లారని గుర్తు చేశారు. అప్పుడు గోవా, ఉత్తరాఖండ్‌లో, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం ఆప్‌కు బలంగా సహకరించిందని ఆమె అన్నారు. బీజేపీని వ్యతిరేకించి 2023లో ఏర్పడిన ఇండియా కూటమి విషయంలో ఆయా పార్టీలు కలిసి అనుకున్న విధంగా ముందుకు వెళ్లలేదన్నారు. ఈ కూటమి విభేదాలు హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురైన భారీ పరాజయాలు ఈ కూటమి నేతృత్వంపై అభిప్రాయాలు క్రమంగా మారాయని చెప్పారు.


ఈ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారాయి. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక్కడ ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, BJP మధ్య కొనసాగుతోంది. ఆప్ దశాబ్ద కాలంగా అధికారంలో ఉంది. మళ్ళీ విజయం కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో బీజేపీ 27 ఏళ్ల విజయ కరువును తీర్చుకుని, తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉంది. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది.


ఇవి కూడా చదవండి:

Omar Abdullah: ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్


AAP vs BJP: ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..


Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..


Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 08 , 2025 | 01:01 PM