Share News

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 08:09 AM

భారత భద్రతా దళాలు మరో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‎ను విజయవంతంగా పూర్తి చేశాయి. జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‎లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
Three Terrorists in Jammu Kishtwar

జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలోని నైద్గామ్ వద్ద ప్రస్తుతం భారత భద్రతా దళాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‎ను నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో, భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ధృవీకరించాయి. ఈ ఉగ్రవాదుల్లో జైష్-ఎ-మొహమ్మద్ (JM) కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నట్లు సమాచారం. చత్రూ ప్రాంతంలో ఉగ్రవాదుల గుంపు కనిపించిన తర్వాత, భారత సైన్యం, పోలీసు దళాలు, SOG, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల్లో ముఖ్యంగా జెఎం కమాండర్ సైఫుల్లా ఉండటం, భారత భద్రతా దళాలకి పెద్ద విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల ఇతర స్థావరాలను కూడా గుర్తించాయి.


కాల్పుల విరమణ ఉల్లంఘించడం

పాకిస్తాన్ సైన్యం అఖ్నూర్ సెక్టార్‌లోని కేరీ బట్టల్ ప్రాంతంలో కాల్పుల విరమణను ఉల్లంఘించి, భారత సైన్యాన్ని టార్గెట్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని, ఈ కాల్పుల్లో ఒక భారత సైనికుడు గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


మరింతగా నిఘా

ఈ క్రమంలో ఉగ్రవాదుల చర్యలను ట్రాక్ చేయడానికి భద్రతా దళాలు, భదేర్వా ప్రాంతంలో నిఘాను మరింతగా పెంచాయి. ఇది సమర్థవంతంగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించడానికి, ఆయా ప్రాంతాలపై కంట్రోల్ ఉంచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంతం కొండ ప్రాంతాలు కావడంతో ఎత్తైన పచ్చిక భూములపై భద్రతా దళాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. భద్రతా దళాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌ల ద్వారా నిఘా పెంచుతూ, కిష్త్వార్, ఉదంపూర్, కథువా జిల్లాలను అనుసంధానించే ఎత్తైన ప్రాంతాల్లో కూడా గట్టి నిఘాను పెంచాయి. ఈ మార్గంలో ఉగ్రవాదులు చోరబడుతున్నట్లు నివేదికలు వచ్చాయి.


మరిన్ని ఎన్‌కౌంటర్లు

ఇటీవల కిష్త్వార్ జిల్లా, దోడా, ఉధంపూర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన అనేక ఎన్‌కౌంటర్లలో, మరికొంత మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ పరిణామాలు, దళాలకు మరింత సవాళ్లను సూచిస్తున్నాయి. భారత భద్రతా ధళాలు దృఢ సంకల్పంతో ఉగ్రవాదులపై కొనసాగిస్తున్న పోరాటంలో విశేషమైన విజయాలు సాధిస్తున్నాయి. వాటిని సమర్థవంతంగా చేయడానికి గగన తలంలో కూడా వందలాది సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం ఉగ్రవాదుల విషయంలో చేస్తున్న పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు


SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా


Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 12 , 2025 | 08:22 AM