Share News

అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన ఉండాలి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:53 PM

అగ్నిప్రమాదాలపై ప్రజలు అవగాహన ఉం డాలని డీఎస్పీ మొగులయ్య అన్నారు.

అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన ఉండాలి

గద్వాల డీఎస్పీ మొగులయ్య

గద్వాల క్రైం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాదాలపై ప్రజలు అవగాహన ఉం డాలని డీఎస్పీ మొగులయ్య అన్నారు. సోమవా రం డీఎస్పీ కార్యాలయంలో ఫైర్‌ అధికారులతో కలిసి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను వి డుదల చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి ఈనెల 20 వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 101కు కాల్‌ చేయా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, స్టేషన్‌ ఫైర్‌ ఎస్‌ఐ రాకేష్‌, సిబ్బంది వెంకటయ్య, ఎం.డి. గౌస్‌పాష, ఆనంద్‌, లక్ష్మన్ననాయుడు, సందీప్‌, మహేందర్‌, రవిప్రకాశ్‌ ఉన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:54 PM