Telangana expatriate: మృత్యువుతో పోరాడి ఓడిన తెలంగాణ వాసి
ABN, Publish Date - Apr 07 , 2025 | 04:33 AM
ఇరాక్ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ వాసి గడ్డం నర్సారెడ్డి ఆరు నెలలుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. చికిత్సకు స్పందించకుండానే ఆయన చివరికి మరణించారు

6 మాసాలుగా చికిత్స.. చివరికి మృతి
ఇరాక్ సరిహద్దులోని ఆరార్లో ఘటన
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఉపాధి కోసం సౌదీ అరేబియాలోని ఇరాక్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లిన తెలంగాణ వాసి ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆరు మాసాలుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూశాడు. ఇరాక్ సరిహద్దులోని ఆరార్ నగరంలో పని చేస్తున్న జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తుంభరావుపేట గ్రామానికి చెందిన గడ్డం నర్సారెడ్డి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. సౌదీ ప్రభుత్వం భారీ మొత్తంలో వెచ్చించి నర్సారెడ్డికి చికిత్స చేయించింది. అయినా, ఫలితం దక్కలేదు. చికిత్సకు స్పందించని నర్సారెడ్డి ఆదివారం చనిపోయాడు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సహకరించాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సౌదీ అరేబియాలోని భారతీయ రాయబారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News
Updated Date - Apr 07 , 2025 | 04:34 AM