14వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Mar 19 , 2025 | 09:38 AM
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
అమరావతి, మార్చి 19: ఏపీ శాసనసభ సమావేశాలు (AP Assembly Session) 14వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు సభ మొదలవగా.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyanna Patrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. శాసనసభలో మహిళలకు ఆర్థిక సాయం, సంచార పశు వైద్య శాలలు, ఆహార కల్తీ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలు, అదానీ పోర్ట్లా నుంచి ఎగుమతులు దిగుమతులు, విశాఖ రైతులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ, దొనకొండ పారిశ్రామికవాడ తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రెవెన్యూ జీవో నెం 55 వలన ఏర్పడుతున్న సమస్యలపై అత్యవసర ప్రజా ప్రాముఖ్యత అంశంగా సభ దృష్టికి రానుంది.
అలాగే ఈరోజు శాసనసభ ముందుకు పలు బిల్లులు రానున్నాయి. 2025 ఆంధ్ర ప్రదేశ్ ద్రవ్య వినియోగ బిల్లు, 2025 ఆంధ్ర ప్రదేశ్ ఉపాద్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు, 2025 ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీల సవరణ బిల్లును శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఇవి కూడా చదవండి...
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..
Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి
Read Latest AP News And Telugu News
Updated at - Mar 19 , 2025 | 09:39 AM