Home » AICC
Telangana: నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు గన్పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేయనుంది. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీ మున్షీ అదానీ పాల్గొననున్నారు.
ఆగస్ట్ 21, 22 తేదీల్లో జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్లోని పార్టీ కీలక నేతలతోపాటు పార్టీ శ్రేణులతో వారు భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చిస్తారు.
ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ.. తన విచారణను ముగించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సీఎం బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను, ఏఐసీసీ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రమంత్రుల దగ్గరికి సీఎం తీసుకెళ్లనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా(Rahul Gandhi Birthday Celebrations) జరిగాయి.
ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.
హైదరాబాద్: ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు.