Home » Avanigadda
కృష్ణానదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన వారంతా ముగిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ శ్రీహరి రావు హత్య కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 2021 నవంబర్ 27న డాక్టర్ శ్రీహరి రావును దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ శ్రీహరి రావు నాటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వ్యాపార భాగస్వామి కావడంతో హత్య సంచలనంగా మారింది.
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అవనిగడ్డ, (కృష్ణాజిల్లా): అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్కు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్.. రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాల జోరును పెంచాయి. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అధికార పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ వైపు ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు.
అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని అన్నదానం హాలు సీలింగ్ ఒక్కసారిగా విరిగిపడింది. నాణ్యత ప్రమాణాల లోపం కారణంగానే సీలింగ్ కూలిందని భక్తులు, స్థానికులు అంటున్నారు. నాలుగు నెలల క్రితమే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అట్టహాసంగా అన్నదానం హాలుని ప్రారంభించారు.
నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు
Andhrapradesh: మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుద్ధప్రసాద్కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ.. అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారన్నారు.
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. అవనిగడ్డ 2 వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.