Home » New Delhi
తులసి గబ్బర్డ్తో సమావేశమైన విషయాన్ని సామాజిక మాధ్యం 'ఎక్స్'లో రాజ్నాథ్ సింగ్ షేర్ చేశారు. రక్షణ, సమాచార షేరింగ్తో పాటు, ఇండియా-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమ యాదవ్, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ కావడంతో ఇరువురూ కోర్టుకు హాజరయ్యారు.
చినో హిల్స్లోని ప్రముఖ హిందూ ఆలయం బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిర్పై కొందరు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాకుండా ఎవరూ ఆపలేరంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీరప్ప మొయిలీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ఖర్గేను డీకే కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాడ్కాస్ట్ ప్రసారాలు నైతిక ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకోవాలని, అన్ని వయసుల వారు చూసేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్లో చేర్చనున్నట్టు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధాన సభకు ఆహ్వానిస్తున్నామనీ, బడ్జెట్పై వారంతా తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు.
15 సంవత్సరాలు దాటిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.
మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశ రాజధానిలో శనివారంనాడు నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాంక్లేవ్ 2025లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్ గురించి ప్రతిరోజూ సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ, భారత్కు రావాలని తహతహలాడుతున్నాయని చెప్పారు.