Home » Railway News
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ప్రతి 10 నిమిషాలకో బస్సు నడిచేలా ఏర్పట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చర్లపల్లిలో కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడినుంచే కొన్ని రైళ్ళ రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఇతర ఏరియాలకు పది నిమిషాలకో బస్సును ఏర్పాటు చేశారు.
నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్ను 1916లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ప్లాట్ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది.
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్ను రాయగడ డివిజన్లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
RRB Assistant Loco Pilot Notifiction 2025: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, ప్రాంతం, దరఖాస్తు వివరాలు, జోన్ వారీ ఉన్న ఖాళీలను తనిఖీ చేసుకోండి.
తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల సంవత్సరాల కల నెరవేరింది
Railway Line Project: ఏపీకి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్లో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
హైదరాబాద్ నగరవాసులకు రైల్వే మంత్రి తీపికబురు చెప్పారు. ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్)విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ప్రకటించారు.