Home » Samajwadi Party
సార్వత్రిక ఎన్నికల మూడోదశలో ఉత్తరప్రదేశ్లోని కీలకమైన 10 లోక్సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. అవి సంభల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్పురి, ఎటా, బదాయూ, బరేలీ, ఆవ్లా నియోజకవర్గాలు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రసవత్తర రాజకీయానికి పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లో మూడో దశలో ఆసక్తికర సమరం జరగనుంది. వారసత్వం, తిరుగుబాట్లు, చిరకాల విరోధుల మధ్య పోటాపోటీ నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో ఎన్డీయే కూటమి విజయపరంపరకు బ్రేక్ వేసేందుకు సమాజ్వాదీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమిలో భాగ స్వామిగా ఉన్న ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ కలిసి యూపీలో పోటీ చేస్తున్నారు.
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశలో 102 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీయే(NDA), ఇండియా కూటమి పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఒకప్పుడు ఉత్తర్ప్రదేశ్ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్లోని ఒక లోక్సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది.
హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) లోని లక్నోలోని కోర్టు సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు