Home » Sattenapalle
Inter Students Problems: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్ కాసేపు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్ కల్పించినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలానికి చెందిన కోటి స్వాములు, అంకమ్మకు కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి వివాహ జీవితంలో మెల్లిగా మనస్పర్థలు మెుదలయ్యాయి. దీంతో వారు తరచూ గొడవ పడుతుండేవారు.
ఒకే ఇంటి లో ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయవృత్తిలో ఉన్న వారి తల్లిదం డ్రులంతా ఎక్కువగా వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారాలు చేసుకొనేవారే. సాధారణ, దిగువ, మధ్య తరగతి వారు నివసించే ఈ గ్రామంలో రెక్కాడితే గాని డొక్కాడని ని రుపేద ముస్లింలు ఎక్కువగా ఉన్నారు.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పురవీధుల్లో నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు హల్ చల్ చేశారు. ఆదివారం ఉదయాన్నే బుల్లెట్ బండిపై వీధుల్లో చక్కర్లు కొట్టారు.