Home » Vinesh Phogat
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది.
పారిస్ ఒలింపిక్స్లో అనూహ్య రీతిలో పతకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫొగట్ తమ అందరికీ చాంపియనే అని ఆమె సొంత రాష్ట్రం హరియాణా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీ పేర్కొన్నారు.
రెజ్లింగ్లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్కు ప్రవేశించాడు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) పై వేటు వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ..