ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venugopala Krishna : కులగణనపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది

ABN, First Publish Date - 2023-09-26T17:30:43+05:30

కులగణనపై వైసీపీ ప్రభుత్వాని( YCP Govt) కి చిత్తశుద్ధి ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Venugopala Krishna) వ్యాఖ్యానించారు.

అమరావతి: కులగణనపై వైసీపీ ప్రభుత్వాని(
YCP Govt) కి చిత్తశుద్ధి ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Venugopala Krishna) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కులగణన అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం శుభపరిణామం. సీఎం తీసుకున్న నిర్ణయం శాసనసభ చరిత్రలో నిలిచిపోతుంది. గత పాలకులు ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాలు చూసుకున్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు పథకాలు అందలేదు. కుట్రలు, కుతంత్రాలకు టీడీపీ, చంద్రబాబు ఒక వేదికలాగా మారాయి. కులగణనను మెచ్చుకోకపోయినా పర్వాలేదు. దయచేసి కుట్రలతో కులగణనను అడ్డుకోవద్దని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాలు సహకరించాలి. చరిత్ర పుటల్లో జగన్‌రెడ్డి నిలిచిపోతారు. బలహీన వర్గాల ఉద్యమాలకు ఈ రోజు అడగకుండానే దక్కిన ఫలం ఇది’’ అని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T17:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising