ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Btech Ravi: కడపను కరువు మండలాలుగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2023-11-03T19:11:56+05:30

వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ( Btech Ravi ) అన్నారు.

కడప: వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ( Btech Ravi ) అన్నారు. శుక్రవారం నాడు పులివెందులలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...పులివెందుల నియోజకవర్గంలో సరైన వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల పట్ల వైసీపీ నాయకులకు అధికారులకు చిత్తశుద్ధి లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి ఏం చేస్తున్నారు. పక్క జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతులకు కొంతైనా న్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకంలో పని దినాలు పెరిగే అవకాశం ఉంటుంది. పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను రౌడీషీటర్ల మాదిరిగా వేధిస్తున్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ పేరుతో టీడీపీ కార్యకర్తలను మాత్రమే వేధిస్తున్నారు. పోలీసుల తీరు సరైంది కాదు’’ అని బీటెక్ రవి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-03T19:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising