ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YV Subbareddy: ఆ స్కాముల్లో చంద్రబాబు పేరు

ABN, First Publish Date - 2023-09-13T17:48:44+05:30

2014లో ఓటుకు నోటు కేసును కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఇలాగే మేనేజ్ చేశాడని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆరోపించారు.

విశాఖపట్నం: 2014లో ఓటుకు నోటు కేసును కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఇలాగే మేనేజ్ చేశాడని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆరోపించారు. బుధవారం నాడు వైసీపీ ఏర్పాటు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వైవీ సుబ్బారెడ్డి విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘చట్టానికి ఎవరు చుట్టాలు కారు అందరూ సమానమే. ఇప్పటివరకు చంద్రబాబు తనకు అనుకూలంగా న్యాయస్థానాలను మేనేజ్మెంట్ చేస్తూ వచ్చాడు. 2014 నుంచి 19 వరకు వివిధ పథకాల ద్వారా భారీ దోపిడీకి పాల్పడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డులో భారీ స్కాములు జరిగాయి. కోర్టు సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించిన తర్వాతే చంద్రబాబును రిమాండ్ కి తరలించింది.చంద్రబాబు ప్రతి విషయాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టి ఈరోజుకి రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T17:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising