Share News

Lakshman: జనసేనతో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుంది

ABN , First Publish Date - 2023-11-04T21:20:32+05:30 IST

జనసేన పార్టీ ( Janasena party ) తో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

Lakshman: జనసేనతో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుంది

హైదరాబాద్: జనసేన పార్టీ ( Janasena party ) తో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు. శనివారం నాడు ఆయన బీజేపీ కార్యాలంయలో మీడియాతో మాట్లాడుతూ..‘‘పొత్తుల వలన పార్టీలో కొందరికి నష్టం జరగటం‌ సాధారణమే.పొత్తు, సీట్లు సర్దుబాట్లపై పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుగుతున్నాయి. మోదీ మానియా.. పవన్ గ్లామర్‌తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఎస్సీ వర్గీకరణ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. ఎస్సీ వర్గీకరణపై 11వ తేదీన సభలో మోదీ మాట్లాడుతారు. మాదిగ సమాజానికి అణగారిన వర్గాలకు భరోసా కల్పించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ నిర్వహిస్తున్నాం. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి మేరకు 11వ తేదీన మోదీ తెలంగాణకు వస్తున్నారు. సీఎం పదవి నిర్వహించే సామార్థ్యం బీసీలకు లేదా? కేటీఆర్ చెప్పాలి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తోంది. కేసీఆర్ కొడుకు కాకుంటే.. కేటీఆర్ సర్పంచ్ కూడా కాలేరు’’ అని లక్ష్మణ్ ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-04T21:20:36+05:30 IST