ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వారందరికీ ఏప్రిల్ నుంచే రూ. 4 వేలు పంపిణీ..

ABN, Publish Date - Apr 06 , 2024 | 03:53 AM

రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నల్లజర్లలో(Nallajarla) మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు.

  • ఏప్రిల్‌, మే, జూన్‌ పింఛన్‌కు వెయ్యి అదనం

  • ఆ 3 నెలలదీ కలిపి జూలైలో ఇంటికే..

  • అవ్వాతాతలకు చంద్రబాబు కీలక హామీ

  • ఆక్వాకు రూపాయిన్నరకే విద్యుత్‌

  • జోన్‌తో సంబంధం లేకుండా వర్తింపు

  • పెన్షనర్లను బలిగొన్న జగన్‌ రాజీనామా చెయ్‌

  • శవ రాజకీయానికి కుట్ర.. ఇంటికే పంపిణీ వద్దని ఈసీ చెప్పలేదే?

  • అడ్డుకున్నానని నాపై నెపమా?.. ఇంత నీచం, దుర్మార్గం ఉంటుందా?

  • యువతకు జాబ్‌ రావాలంటే ఎన్డీయే.. గంజాయి కావాలంటే జగన్‌

  • నిరుపేదలకు 2 సెంట్ల స్థలం.. ఇంటి నిర్మాణం చేసిస్తాం

  • నరసాపురం, పాలకొల్లు ప్రజాగళం సభల్లో బాబు

రాజమహేంద్రవరం, భీమవరం/నరసాపురం/పాలకొల్లు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల చొప్పున పింఛన్‌ ఇస్తాను. ఏప్రిల్‌, మే, జూన్‌ల్లో మీరు తీసుకునే రూ.మూడు వేలకు అదనంగా వెయ్యి చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్‌లో కలిపి అందిస్తాను’’ అని తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు. పింఛనుదార్లను చంపేసి మరోసారి శవరాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు.

వలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయి...

‘‘వలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోనీయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్‌ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్‌ ఒకటైతే, జగన్‌ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్‌...వలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైలుమీద సంతకం పెడతానని సిగ్గులేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్నవారి కెరీర్‌ పెరిగేలా, మరింత ఆదాయానికి ఏమి చేయాలో చేసే బాధ్యత మాదని పదేపదే చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే, రెండోరోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారు.. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వలంటీర్లు రాజకీయాల్లో జోక్యంచేసుకోవడానికి వీల్లేదు. వలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి. మీ కెరీర్‌ కూడా బిల్డప్‌ చేస్తామని చెప్పాం’’

పెన్షన్‌ పేటెంట్‌ టీడీపీదే..

‘‘పెన్షన్ల పేటెంట్‌ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదట తేదీనే ఇస్తాం. ఇంటి దగ్గరే ఇస్తాం. పెంచిన రూ.4వేలు ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల వరకూ ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రూ.13 లక్షలకోట్లు అప్పుతెచ్చాడు. ఖజానా ఖాళీ అయ్యింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. జగన్‌ను చూస్తుంటే పాత సినిమాలో విలన్‌ నాగభూషణం గుర్తుకొస్తున్నాడు. ఫ్యాన్‌ అరిగిపోయింది. దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. జగన్‌ ఎక్స్‌ఫైర్డ్‌ మెడిసిన్‌.’’

వచ్చాడు.. బచ్చా

‘‘నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు.. బచ్చా.. వదలను.. నా తడాఖా చూపిస్తా. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి. నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం. దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూహక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఒంటిమిట్టలో ఒక కార్మికుడు తనకున్న నాలుగు ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా.. న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారు.’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పెన్షనర్ల పట్ల జగన్‌ నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆయనను ఈసీ ప్రశ్నించాలి. జగన్‌ చేతకాని తనం, దురుద్దేశ చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు. ఈ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి’’

‘‘నేను మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానంటే.. జగన్‌ రాజీనామా చేసిన వలంటీర్ల నియామకంపై తొలి సంతకం చేస్తానంటున్నాడు. నాది సమాజహితం. జగన్‌ది స్వార్ధం. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి, గంజాయ్‌ కావాలంటే జగన్‌ రావాలి’’

- చంద్రబాబు

ఆక్వాకు రూపాయిన్నరకే విద్యుత్‌

జోన్‌తో సంబంధం లేకుండా వర్తింపు

రైతును రాజును చేస్తా : చంద్రబాబు

అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుని రాజును చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో ఆయన మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం చేసి, రాయితీలు కల్పిస్తాం. ఆక్వా రైతులకు జోన్‌తో నిమిత్తం లేకుండా రూపాయిన్నరకే విద్యుత్‌ను సరఫరా చేస్తాం.’’ అని హామీ ఇచ్చారు.

టీడీపీలోకి రఘురామరాజు

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 5: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఐదేళ్లపాటు జగన్‌ అవినీతి, అరాచక పాలనపై పోరాటం చేస్తూ తెలుగు ప్రజల పక్షాన నిలబడ్డవ్యక్తి రఘురామరాజు అని కొనియాడారు. రఘురామ మాట్లాడుతూ... జగన్‌ను గద్దె దింపడమే ధ్యేయంగా పోరాటం సాగిస్తానని తెలిపారు.

టీడీపీలోకి పాకాల జడ్పీటీసీ పద్మజారెడ్డి దంపతులు

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పాకాల మండల జడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి, ఆమె భర్త బాబురెడ్డి తమ అనుచరులతో కలసి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి ఇన్‌చార్జి పులపర్తి నాని ఆధ్వర్యంలో వీరు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉన్న చంద్రబాబును కలసి పార్టీ కండువా కప్పుకొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2024 | 07:31 AM

Advertising
Advertising