ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఢిల్లీలో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు చంద్రబాబు విందు..

ABN, Publish Date - Jul 04 , 2024 | 10:07 PM

ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు.

ఢిల్లీ: ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగువారు న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి, నివసించడానికి ఎక్కువ మంది అంతగా ఆసక్తి చూపలేదు.


అయితే మేము ఐటీరంగం అభివృద్ధికి పునాదులు వేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ నగరానికి ఖ్యాతి వచ్చింది. ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అమరావతి విషయంలోనూ అదే జరుగుతుంది. ప్రస్తుతానికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికాకున్నా, భవిష్యత్తులో మాత్రం మహానగరంగా ఎదుగుతుంది. పెట్టుబడులు, మానవ వనరులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు చేపడతాం" అని చెప్పారు.

Updated Date - Jul 04 , 2024 | 10:08 PM

Advertising
Advertising