ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kanipakam: విమాన వాహనంపై గణనాథుడి విహారం

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:45 AM

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.

విమానంలో ఊరేగుతున్న సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 20: కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.ఉభయదారులైన ఐరాలకు చెందిన దివంగత రామకృష్ణపిళ్ళై కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయదారులు వరస తీసుకురావడంతో అలంకార మండపంలో స్వామి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించి.. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను విమాన వాహనం (సప్పరం)పై ఉంచి కాణిపాక పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈవో గురుప్రసాద్‌, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్‌స్పెక్టర్లు విఘ్నేష్‌, రవి, ఉభయదారులు పాల్గొన్నారు.

పుష్పపల్లకి సేవకు భారీ ఏర్పాట్లు

కాణిపాకంలో స్వామికి శనివారం నిర్వహించనున్న పుష్పపల్లకి సేవకు ఉభయదారులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రఽధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లను ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. లడ్డు, ప్రసాదాల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లు పెడుతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:45 AM