మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తిరువూరు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. గుర్తులు ఇవే..

ABN, Publish Date - May 13 , 2024 | 10:10 AM

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్‌లో 13 వరుసలు ఉండగా.. మొదటి 12 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, చివరిది నోటా. మొదటి నలుగురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా.. మిగతా 8 మంది రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు.

తిరువూరు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. గుర్తులు ఇవే..
Tiruvuru Assembly Seat

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో ప్రధానపార్టీ అభ్యర్థుల గుర్తులు ముందువరుసలో ఉంటాయి. ఆ తరువాత రిజిస్టర్డ్ పార్టీలు, స్వంతంత్ర అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. ఓటువేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుల ఆధారంగా ఓటు వేయ్యొచ్చు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ ఈవీఎంలో ఉంటుంది. ఆ పేరు ఎదురుగా ఉన్న బటన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయ్యొచ్చు.

AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ


తిరువూరులో..

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్‌లో 13 వరుసలు ఉండగా.. మొదటి 12 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, చివరిది నోటా. మొదటి నలుగురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా.. మిగతా 8 మంది రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు. బ్యాలెట్‌లో మొదటి గుర్తు తెలుగుదేశం అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుది కాగా.. రెండో గుర్తు వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, మూడో గుర్తు బీఎస్పీ అభ్యర్థి లక్కెపోగు వందన్‌కుమార్, నాలుగో గుర్తు కాంగ్రెస్ అభ్యర్థి లాం తాంతియా కుమారిది.


AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 13 , 2024 | 10:10 AM

Advertising
Advertising