ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తీయడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం..

ABN, Publish Date - Aug 07 , 2024 | 02:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.


ఏపీ క్యాబినెట్ సమావేశంలో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్ల అంశం చర్చకు వచ్చింది. సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ, పేరు తొలగించాలని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బొమ్మల పిచ్చితో జగన్ రూ.700కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. దీంతో జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి క్యాబినెట్ ఓకే చెప్పింది.


అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కు తీసుకోవాలని తీర్మానించారు. భూముల రీ-సర్వేపై కెబినెట్‌లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీ-సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై కూడా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల భూ యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు చెప్పారు. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది.

Updated Date - Aug 07 , 2024 | 02:34 PM

Advertising
Advertising
<