ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఆ నేతను టార్గెట్ చేశారుగా..!

ABN, Publish Date - Jan 30 , 2024 | 04:39 PM

టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) పేరుతో ఫేక్ పోస్టులు పెట్టి వైసీపీ మూకలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ మూకల పోస్టులకు అతను ఎక్స్(ట్విట్టర్) వేదికగా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.

విజయవాడ: టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) పేరుతో ఫేక్ పోస్టులు పెట్టి వైసీపీ మూకలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ మూకల పోస్టులకు అతను ఎక్స్(ట్విట్టర్) వేదికగా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎక్స్(ట్విట్టర్)లో నేను దూషించినట్లుగా.. నా ఫేక్ ఐడీతో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా. ఈ పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు లేఖ రాశా. వైసీపీ ఆకతాయిలు కావాలనే దుష్పచారం చేస్తున్నాయి. జగన్‌‌ సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తున్నారు. జగన్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మలు... నా పేరు మీద ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలకు నేను భయపడను. దీని వెనుక ఉన్న బుజ్జి, నానీలకు ఒకటే చెబుతున్నా... మీరంతా కలిసి నా ఈక కూడా పీకలేరు’’ అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

కాగా.. టీడీపీ(TDP) నేతలపై వైసీపీ(YSRCP) మూకలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి. ఈ విషయంపై టీడీపీ నేతలు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దాంతో మరోసారి వైసీపీ మూకల చేష్టలు పెచ్చుమీరుతున్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 05:55 PM

Advertising
Advertising