ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Home Minister Anitha: పోలీసులపై హోంమంత్రి సీరియస్.. కారణమిదే..?

ABN, Publish Date - Jul 16 , 2024 | 06:53 PM

బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సీరియస్ అయ్యారు.

అమరావతి: బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సీరియస్ అయ్యారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో పెట్టిన ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ చేయాలని హోంమంత్రి ఆదేశింశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే హత్య కేసు పెట్టి ఖాకీలు వేధింపులకు గురిచేసిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. నల్లపాడుకు చెందని శంకరలీలా తన కుమార్తెను కిడ్నాప్ చేశారని నల్లపాడు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసిన శంకర లీలాపై హత్య కేసు పెట్టి వేధింపులకు నల్లపాడు పోలీసులు గురిచేశారు. రెండు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సంఘటనపై ఈ రోజు సచివాలయంలో హోంమంత్రిని కలిసి శంకరలీలా చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసి ఖాకీలు వేధించారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని గుంటూరు పోలీసు ఉన్నతాధికారులకు హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jul 16 , 2024 | 07:45 PM

Advertising
Advertising
<