Share News

TDP: చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో టీడీపీ సమావేశం

ABN , Publish Date - May 31 , 2024 | 10:39 AM

అమరావతి: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

TDP: చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో టీడీపీ సమావేశం

అమరావతి: కౌంటింగ్(Counting) రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ (TDP) దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు (Chief Election Agents) పార్టీ కార్యాలయంలో శుక్రవారం ట్రైనింగ్ (Training) ఇవ్వనున్నారు. జూన్ 4వ (June 4th) తేదీ కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైసీపీ నేతల (YCP Leaders) వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఓటమి భయంతో వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగబోతున్నారని ఇప్పటికే వెళ్లడైంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై టీడీపీ సీనియర్ నేతలు, ఎజెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. కౌంటింగ్ రోజున ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది.. తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.


కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వారు కౌంటింగ్‌కు అక్కరలేదని, వాదించే వారు మాత్రమే వెళ్ళాలని రామకృష్ణా రెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీ లోని u/s 153,505 (2) IPC, 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు.


పోల్ మేనేజ్ మెంట్ తరహాలోనే కౌంటింగ్ డే మేనేజ్ మెంట్ కూడా చేయగలిగితేనే ఎన్నికల్లో తమకు గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ ఏజెంట్లకు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ మేనేజ్‌మెంట్ క్లాస్ తీసుకున్నారు. రూల్స్ అంటూ మడి కట్టుకుని కూర్చొని ఏ ఒక్క ఓటునూ వదిలేయొద్దని.. వైసీపీ టార్గెట్ ఏంటో తెలుసుకుని కౌంటింగ్ రోజు పని చేయాలన్నారు. అవసరమైతే రూల్స్ దాటి అయినా పనిచేయాలని సూచించారు. రూల్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ లేకుండా చేయాలని సూచించారు. ప్రతీ కౌంటింగ్ ఏజెంట్‌కు ఈ విషయాలన్నీ క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలని ఛీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

రాష్ట్ర గీతం జాతికి అంకితం: రేవంత్ రెడ్డి

కౌంటింగ్‌కు ముందే.. వైసీపీలో ఓటమి భయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 10:39 AM