ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Political War: దీపావళికి ముందే ఏపీలో పొలిటికల్ టపాసులు పేలతాయా.. తుస్సుమంటాయా..

ABN, Publish Date - Oct 24 , 2024 | 09:27 AM

చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సంచలనమైన అంశాలను వెలుగులోకి తీసుకొస్తాయి. మరికొన్నిసార్లు ఊహించినంత సంచలనం ఉండకపోవచ్చు. గతంలో తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి సవాళ్ల పర్వాన్ని చూసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం, వైసీపీ చేసిన ట్వీట్లపై మాత్రం తీవ్ర ఆసక్తి నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో..

TDP vs YSRCP

వైసీపీ, టీడీపీ పోటాపోటీ ట్వీట్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అక్టోబర్ 24 గురువారం మధ్యాహ్నం 12 గంటలు ఎప్పుడవుతుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. అసలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగబోతుందనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. అసలు రెండు పార్టీలు ప్రజలకు ఏం చెప్పబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఆ రెండు పార్టీలు చెప్పే అంశాలు నిజంగానే బాంబుల్లా పేలతాయా లేదంటే తుస్సుమంటాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సంచలనమైన అంశాలను వెలుగులోకి తీసుకొస్తాయి. మరికొన్నిసార్లు ఊహించినంత సంచలనం ఉండకపోవచ్చు. గతంలో తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి సవాళ్ల పర్వాన్ని చూసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం, వైసీపీ చేసిన ట్వీట్లపై మాత్రం తీవ్ర ఆసక్తి నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి.. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న భారీ అక్రమాలు, కుంభకోణాలను ఏవైనా బయటపెడతాయా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ ఏం చెప్పబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి విపక్షాలు అధికారపక్షంపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తుంటాయి. ఇవాళ కూడా అలాంటి ఓ రాజకీయ ఆరోపణను వైసీపీ చేయనుందా.. లేదంటే అంతకుమించి ఇంకేమైనా సంచలన విషయాన్ని బయటపెడుతుందా అనే ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది.


టీడీపీ ఏం బాంబు పేల్చనుంది..

వేచి చూడండి.. అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ బుధవారం ఉదయం 11.35 గంటలకు టీడీపీ అఫిషియల్ ట్విట్టర్‌ ఖాతా నుంచి ట్వీట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఏ విషయాన్ని వెల్లడించనుంది. ఏదైనా సంచలనమైన పథకాన్ని ప్రవేశపెట్టబోతుందా.. లేదంటే గత ప్రభుత్వ అక్రమాలు, కుంభకోణాలపై ఏదైనా సంచలన విషయాన్ని వెల్లడించనుందా అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని గతంలో వైసీపీ చేసిన ఏవైనా కుట్రలను బయటపెట్టనున్నారా.. అంటూ ఎవరికి వారు తమకు తోచినట్లు ఊహించుకుంటున్నారు. టీడీపీ చేసిన ట్వీట్ మాత్రం పేలింది. కానీ టీడీపీ ప్రకటించే అంశం బాంబులా పవర్‌ఫుల్‌గా పేలుతుందా లేదా తుస్సుమంటుందా అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.


కౌంటర్ కోసమేనా..

గురువారం మధ్యాహ్నం బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ ట్వీట్ చేసిన రెండు గంటల వ్యవధిలో వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్ అంటూ ట్వీట్ చేసింది. టీడీపీ ఉదయం 11.35కు ట్వీట్ చేయగా.. వైసీపీ మధ్యాహ్నం 1.38 గంటలకు ట్వీట్ చేసింది. కేవలం కౌంటర్ ఇచ్చేందుకే వైసీపీ ట్వీట్ చేసిందా.. లేదంటే నిజంగానే ఏదైనా సంచలన విషయాన్ని బహిర్గతం చేయనుందా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ ఏదైనా విషయాన్ని బయటపెట్టాలంటే ముందుగానే ట్వీట్ చేసి ఉండేవారని, కేవలం టీడీపీ ట్వీట్ చేసిన కొన్ని గంటలకు కౌంటర్‌ ఇచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు పోటీగా ట్వీట్ చేసి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అసలు మధ్యాహ్నం 12 గంటలకు రెండు బాంబులు పేలతాయా.. ఒకటే పేలుతుందా.. లేదంటే రెండూ తుస్సుమంటాయా అనేది తెలియాలంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 24 , 2024 | 10:45 AM