ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JC Diwakar Reddy: జేసీకి ఏమైంది..? మరీ ఇలా అయిపోయారేంటి..?

ABN, Publish Date - Sep 08 , 2024 | 04:08 PM

తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూసిన ప్రజలు.. జేసీకి ఏమైంది? అసలు ఈయన జేసీ దివాకర్ రెడ్డేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

JC Diwakar Reddy

అనంతపురం, సెప్టెంబర్ 08: తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం అడ్డగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్‌తో తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. ముక్కుసూటిగా, మనసులో ఏమనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ప్రభుత్వం తమది ఉన్నా సరే.. ఆయన చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. ఆయన కామెంట్స్ కారణంగా కొన్నిసార్లు ప్రభుత్వాలే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతిమాట తూటాల్లా పేలుతాయి. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి.. గత కొన్నాళ్లుగా మీడియా ముందుకే రావడం లేదు. అయితే, తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూసిన ప్రజలు.. జేసీకి ఏమైంది? అసలు ఈయన జేసీ దివాకర్ రెడ్డేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


2014లో టీడీపీ తరఫున అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన దివాకర్ రెడ్డి.. 2019 ఎన్నిలకల్లో తన కొడుకు జేసీ పవన్ రెడ్డిని ఎంపీగా బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో పవన్ ఓడిపోగా.. 2024లో మళ్లీ పవన్ రెడ్డే నిలిచాడు. ఈసారి భారీ మెజార్టీతో పవన్ రెడ్డి విజయం సాధించారు. ఇదంతా ఓకే గానీ.. గత ఏడాది నుంచి జేసీ దివాకర్ రెడ్డి పొలిటికల్ కామెంట్స్ పెద్దగా వినిపించడం లేదు. కనీసం ఆయన కూడా కనిపించడం లేదు. అయితే, తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జేసీ ఏంటీ ఇలా అయిపోయారు? అని ఆశ్చర్యపోతున్నారు.


వైరల్ అవుతున్న ఫోటోలో జేసీ పవన్ రెడ్డితో పాటు.. దివాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫోటోలో కనీసం గుర్తు పట్టరాకుండా ఉన్నారు దివాకర్ రెడ్డి. పవన్ రెడ్డి పట్టుకోగా.. దివాకర్ రెడ్డి నిల్చుని ఉన్నారు. అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆ ఫోటో కనిపిస్తోంది. చాలా బక్కచిక్కిపోయి.. నీరసంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్నది నిజంగా జేసీ దివాకర్ రెడ్డేనా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి అంటే.. ఆయన మాటలోని గాంభీర్యం, ఠీవీగా నిల్చునే ఆయన ఆహార్యం.. ఎమైపోయాయి? ఏమైంది ఆయనకు? అని కామెంట్స్‌ బాక్స్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


Also Read:

ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు... విశాఖ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన

బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా క్లాస్..

ఖమ్మం ఊపిరిపీల్చుకో!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 08 , 2024 | 04:17 PM

Advertising
Advertising