Share News

Kesineni Chinni: మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడం..

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:50 PM

తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు.

Kesineni Chinni: మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడం..

విజయవాడ: తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు. మీ అందరి కష్టం వల్లే తాను ఎంపీగా గెలిచానన్నారు. ఇంత భారీ విజయంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. శక్తి వంచన లేకుండా అభివృద్ధి కోసం పని చేస్తానని కేశినేని చిన్ని తెలిపారు.


ఉడతా భక్తిగా తన వంతు‌ సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. బుద్ధా వెంకన్న, తన లాంటి వాళ్లు మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరేది మాట్లాడబోమని కేశినేని చిన్ని తెలిపారు. మాకు ఏదనిపిస్తే అదే ఓపెన్‌గా చెబుతామన్నారు. టీడీపీ కోసం పని చేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ అధిష్టానం మన కృషికి తగిన విధంగా గౌరవిస్తుందని తెలిపారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరం‌ కలిసి పని చేద్దామన్నారు. గత నాయకుడి ఒంటెత్తు పోకడలు మరచిపోవాలని సూచించారు. ఇక నుంచి మనమంతా ఒకటని.. తనకు అండగా నిలిచిన ప్రజలను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని కేశినేని చిన్ని అన్నారు.


బుద్దా వెంకన్న ఆయన సీటు కన్నా..‌ తన సీటు కోసం చాలా కష్టపడ్డారని కేశినేని చిన్ని తెలిపారు. నాగుల్ మీరా కూడా తన కోసం పని చేశారన్నారు. మీరు ఇచ్చిన సహకారం, మీరు పడిన కష్టం ఎప్పుడూ మరువబోనని తెలిపారు. కూటమి పొత్తు వల్ల సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందని.. కానీ భవిష్యత్తు లో అందరికీ న్యాయం చేసేలా తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యకర్తలు నుంచి నాయకుల వరకూ తనతో నడిచిన వారందరినీ గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. మనందరం టీడీపీ అభివృద్ధి కోసం కలిసి పని‌ చేద్దామని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 29 , 2024 | 01:56 PM