ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budameru: బుడమేరుకు తగ్గిన వరద.. గండ్లు పూడ్చివేత పనులు ప్రారంభం

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:36 AM

Andhrapradesh: 48 గంటలుగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. దీంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టారు.

Budameru Vijayawada

ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 3: 48 గంటలుగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. దీంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టారు. రానున్న మూడు రోజుల పాటు పనులు కొనసాగే అవకాశం ఉంది. బుడమేరుకు వరద ప్రవాహం తగ్గిపోవడంతో ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు.

Rain Effect: ప్రకాశం బ్యారేజ్‌కి స్వల్పంగా తగ్గిన వరద ఉద్ధృతి..


జగదిగ్బంధంలో ప్రజానీకం..

కాగా.. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. బుడమేరుకు భారీగా వరద వచ్చి చేరడంతో విజయవాడలోని 16 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దాదాపు రెండు రోజులుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం జలదిగ్భంధంలో ఉండిపోయారు. బుడమేరులో ప్రస్తుతం 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బుడమేరు కాస్త శాంతించడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు


ఆహారం సరఫరా...

మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈరోజు ఉదయం నుంచి 37 లోకేషన్లలో ఆహారాన్ని విడుదల చేసింది సర్కార్. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి హెలికాప్టర్ల ఆపరేషన్ షురూ చేశారు. అలాగే పడవల ద్వారా కూడా ఆహారాన్ని అందజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

నా జనం ఏమయ్యారు?

Heavy Rains: పడవల ద్వారా ఆహారం సరఫరా.. కాసేపట్లో సింగ్‌నగర్‌‌కు చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 04:11 PM

Advertising
Advertising