ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bonda Uma: మీడియాపై విజయసాయి రెడ్డికి మాట్లాడే హక్కు లేదు

ABN, Publish Date - Jul 18 , 2024 | 02:45 PM

Andhrapradesh: మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టులు, మీడియాతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు మీడియా గొంతు నొక్కాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Bonda Uma

విజయవాడ, జూలై 18: మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasaireddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టులు, మీడియాతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా (MLA Bonda Uma) మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు మీడియా గొంతు నొక్కాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh: జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్..


బ్లూ మీడియా ఛానళ్ళు మాత్రమే ప్రసారామయ్యేలా చేశారన్నారు. మీడియాపై విజయసాయి రెడ్డికి మాట్లాడే హక్కు లేదన్నారు. మీడియాకి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టంచేశారు. మీడియాలో వచ్చిన వాటికీ ముందు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడిన ప్రతి మాటకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలంటి వాళ్ళు కాబట్టే వైసీపీని ప్రజలు ఇంటికి పంపి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారన్నారు. ఇలాంటి వాటికి మీడియా సోదరులు, యాజమాన్యం బెదర వద్దని... కచ్చితంగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని బోండా ఉమా భరోసా ఇచ్చారు.

AP News: అడ్డొచ్చిన పోలీసులను ప్రేమోన్మాది ఏం చేశాడంటే?


సాక్షి చేసిందేమిటి?: బుద్దా వెంకన్న

మీడియాపై విజయ్ సాయి రెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికి తీయడం తప్ప మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయ సాయి రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా... గతంలో సాక్షి చేసింది ఏమిటి అని ఎదురుదాడికి దిగారు. ఎంతమందిని విజయ్ సాయి రెడ్డి వ్యక్తిగతంగా దూషించలేదు అని నిలదీశారు. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బేషరతుగా మీడియా సంస్థలకు, సంస్థ యజమానులకు క్షమాపణ చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

Guidecast: ‘గైడ్‌కాస్ట్‌’ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన విద్యాసంస్థ నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 02:54 PM

Advertising
Advertising
<