ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Balakrishna: నవరత్నాలతో మోసం చేసిన జగన్

ABN, Publish Date - Apr 13 , 2024 | 06:17 PM

నవరత్నాలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. శనివారం నాడు కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు.

కదిరి: నవరత్నాలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. శనివారం నాడు కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు. తల్లి , చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చి సొంత బాబాయ్‌ను హత్య చేసిన నిందితులను జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో చంద్రబాబు సాగునీరు పారిస్తే సైకో జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు.


ఒక్క ఛాన్స్‌తో అన్ని వర్గాలను నిండా ముంచారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అధోగతి పాలవుతుందన్నారు. ముస్లిం, మైనార్టీలకు అండగా నిలబడేది టీడీపీనేనని చెప్పారు. జగన్ వచ్చాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోయాయని బాలకృష్ణ మండిపడ్డారు. ఏపీని జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. బాలకృష్ణ మాట్లాడుతున్న వీడియోని ఇక్కడ చూడండి.

Chandrababu: ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 06:47 PM

Advertising
Advertising