16.5 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Oct 07 , 2024 | 12:01 AM
మండలంలోని గరుడబిల్లి జంక్షన్ సమీపంలో వీరాగౌరీశంకర్ స్టోన్ క్రషర్లో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని బొండపల్లి ఇన్చార్జి ఎస్ ఐ కె.లక్ష్మణరావు దాడిచేసి ఆదివారం స్వాఽఽధీనం చేసుకున్నారు.

బొండపల్లి: మండలంలోని గరుడబిల్లి జంక్షన్ సమీపంలో వీరాగౌరీశంకర్ స్టోన్ క్రషర్లో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని బొండపల్లి ఇన్చార్జి ఎస్ ఐ కె.లక్ష్మణరావు దాడిచేసి ఆదివారం స్వాఽఽధీనం చేసుకున్నారు. గజపతినగరం మం డలంలోని బూడిపేట గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలనాయుడు 330 బ స్తాలు(16.5 టన్నుల) పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసిన బియ్యాన్ని నిల్వచేశాడ న్న సమాచారంతో దాడిచేసి పట్టుకున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. ఈ బియ్యాన్ని సీఎస్డీటీ తిరుపతిరావుకు స్వాధీనపరచి నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.