Share News

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:30 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎంపీసీ సమావేశం అనంతరం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్(Shaktikanta Das) ఈ విషయాన్ని వెల్లడించారు.

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా
RBI not changing repo rate

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో (రేపో రేటు 6.5%) ఎలాంటి మార్పు చేయలేదు. ఎంపీసీ సమావేశం అనంతరం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్(Shaktikanta Das) ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 5 నుంచి 7 మధ్య జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో కమిటీలోని 6 మంది సభ్యులలో 4 మంది పాలసీ రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని అంగీకరించారని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతోపాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF), స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్లను కూడా వరుసగా 6.75%, 6.25% వద్దనే ఉంచింది.


సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా రెపో రేటును ఫిబ్రవరి 2023లో పెంచింది. ఈ పెంపు తర్వాత రెపో రేటు 6.5 శాతానికి తగ్గింది. దీని తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వరుసగా 8 సార్లు సమావేశమైంది. బ్యాంకులు రెపో రేటు ఆధారంగా రుణంపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. దీంతో మీ హోమ్ లోన్, కార్ లోన్, ఇతర అన్ని రకాల లోన్‌ల EMIలో మీకు ఎలాంటి ఉపశమనం లభించదని చెప్పవచ్చు.


ఈ క్రమంలో FY25 Q1లో GDP వృద్ధి 7.3%గా అంచనా వేయబడిందని శక్తికాంత దాస్ చెప్పారు. Q2 7.2% వద్ద ఉండగా, Q3 7.3%, Q4 7.2% వద్ద ఉంచింది. మొత్తం సంవత్సరానికి గాను జీడీపీ అంచనా 7.2% కాగా, గతసారి 7 శాతం కంటే జీడీపీ వృద్ధి అంచనాను 7.2%కి పెంచినట్లు గవర్నర్ చెప్పారు.

ఇక FY25 కోసం CPI ద్రవ్యోల్బణం రేటు 4.5%గా అంచనా వేయబడిందని శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇది Q1లో 4.9%, Q2లో 3.8%, Q3లో 4.6%, Q4లో 4.5%గా ఉండవచ్చని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం లక్ష్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎలాంటి మార్పు చేయలేదు. చివరిసారి కూడా గవర్నర్ FY25 కోసం ద్రవ్యోల్బణ రేటు లక్ష్యాన్ని 4.5%గా మాత్రమే నిర్ణయించారు.


ద్రవ్యోల్బణం విషయంలో సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గిందని శక్తికాంత దాస్ అన్నారు. కానీ ఆహార ద్రవ్యోల్బణం రేటులో పెరుగుదల కనిపించిందన్నారు. వేసవిలో కూరగాయల ధరలు పెరిగాయని, LPG ధరలు తగ్గినందున ఇంధనంలో ప్రతి ద్రవ్యోల్బణ ధోరణి ఉందన్నారు. సేవల ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉందని, వస్తువుల ద్రవ్యోల్బణం కూడా పరిధిలోనే ఉందని తెలిపారు. ఇక రబీలో కూరగాయలు, పప్పుధాన్యాల రాకపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

2 రోజుల్లో రూ.21 లక్షల కోట్లు


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

For Latest News and Business News click here

Updated Date - Jun 07 , 2024 | 11:06 AM