Share News

Hyderabad: ఇంజనీరింగ్‌ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో నగరానికి వచ్చి.. చివరకు ఏమయ్యారో తెలిస్తే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 09:42 AM

వారు ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగ వేటలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. తమ ప్రయత్నాలను చేస్తుండగానే దురదృష్టం వెంటాడింది.

Hyderabad: ఇంజనీరింగ్‌ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో నగరానికి వచ్చి.. చివరకు ఏమయ్యారో తెలిస్తే..

- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

హైదరాబాద్: వారు ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగ వేటలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. తమ ప్రయత్నాలను చేస్తుండగానే దురదృష్టం వెంటాడింది. వారిద్దరూ ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఈ సంఘటన విప్రో సర్కిల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నచ్చిరెడ్డి నవీన్‌(22), ముళ్లపూడి హరీష్‏చౌదరి(22) ఇద్దరు స్నేహితులు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బైక్‌పై గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి(Goulidodi to Gachibowli)కి వస్తున్న సమయంలో విప్రో సర్కిల్‌కు వందమీటర్ల దూరంలో వారి బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

ఇదికూడా చదవండి: Secunderabad: నేటినుంచి పలు ఎంఎంటీఎస్‌, డెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు


వాహనదారులు కొందరు 108కు ఫోన్‌ చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాయవరం మండలం లొల్లగ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం గౌలిదొడ్డిలోని హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 09:42 AM