ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా సారూ..

ABN, Publish Date - Jul 05 , 2024 | 10:52 AM

సైదాబాద్‌ పోలీస్‏స్టేషన్‌లో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పోలీస్‏స్టేషన్‌కు వెళ్లిన బాధితుడిని ఎస్‌ఐ గదిలోకి తీసుకువెళ్లి బూతులు తిడుతూ ఇతర సిబ్బందితో కలిసి రబ్బర్‌ బెల్ట్‌, కర్రలతో చితక బాదారు. దాంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.

- పోలీస్‌స్టేషన్‌లో బాధితుడిపై పోలీసుల దాష్టీకం

- గదిలో పెట్టి చితకబాదిన వైనం, ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

హైదరాబాద్: సైదాబాద్‌ పోలీస్‏స్టేషన్‌లో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పోలీస్‏స్టేషన్‌కు వెళ్లిన బాధితుడిని ఎస్‌ఐ గదిలోకి తీసుకువెళ్లి బూతులు తిడుతూ ఇతర సిబ్బందితో కలిసి రబ్బర్‌ బెల్ట్‌, కర్రలతో చితక బాదారు. దాంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానిక నేతలు పోలీస్‏స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో కూడా సదరు ఎస్‌ఐ బాధిత కుటుంబీకులను బెదిరించడం గమనార్హం. సింగరేణి కాలనీ(Singareni Colony)లో నివాసముండే బొందిలి రాంసింగ్‌(55) పండ్ల వ్యాపారి, రెండు నెలల క్రితం అతడి భార్య శకుంతల బాయితో ఇంటి పొరుగున ఉండే ఓ మహిళతో గొడవ జరిగింది. అదే రాత్రి రాంసింగ్‌ భార్య శకుంతల తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఇదికూడా చదవండి: Hyderabad: 30 రోజుల్లో 20 హత్యలు...


పక్కింటి మహిళ దాడి చేసిన కారణంగానే తన భార్య మృతి చెందిందని రాంసింగ్‌ సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆరోగ్య సమస్యలతోనే శకుం తల మృతిచెందినట్లుపోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఇది తెలుసుకున్న రాంసింగ్‌ బుధవారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్‌ను కలుద్దామని సైదాబాద్‌ పీఎస్‏కు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడంతో ఎస్‌ఐ సాయికృష్ణను కలిసేందుకు వెళ్లాడు. ఆలయ పూజారి క్షుద్ర పూజలు చేస్తున్నాడంటూ రాంసింగ్‌ ప్రచారం చేస్తూ, బెదిరింపుల కు పాల్పడుతున్నాడని బుధవారం స్థానిక మహిళలతో కలిసి పూజారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసుకున్న సదరు ఎస్‌ఐ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రాంసింగ్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలర్‌ పట్టుకుని బూతులుతిడుతూ గదిలోకి తీసుకువెళ్లాడు. ఫోన్‌ లాక్కొని స్టేషన్‌లో ఉ న్నఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిసి గదిలో లైట్లు ఆపివేసి బెల్ట్‌లు, కర్రలతో చితకబాదాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానిక నేతలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. సదరు ఎస్‌ఐ వారితో కూడా దురుసు గా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, నేతలు పీఎస్‌ ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధం కాగా విషయం తెలుసుకున్న సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కాంతిలాల్‌పాటిల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఎస్‌ఐ తీరుపై ఆగ్రహించి బాధితుడి కుటుంబసభ్యులను, నేతలను సముదాయించారు.


కాళ్లపై పడ్డా కనికరించలేదు..

తాను అనారోగ్యంతో ఉన్నానని కాళ్లమీద పడ్డా కనికరించలేదని బాధితుడు రాంసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. నీవు ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో.. నన్ను ఎవరూ ఏమి చేయలేరు.. చేస్తే వేరే పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతా అంటూ హుకుం జారీ చేశారని తెలిపాడు. ఫోన్‌లు సైతం గుంజుకున్నారని వివరించాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడువలేని స్థితిలో ఉన్నానని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. పోలీసులు కొట్టడంతో తలకు. శరీరంపై గాయాలున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు రిపోర్టును మీడియా ప్రతినిధులకు చూపాడు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 10:52 AM

Advertising
Advertising