Share News

Viral News: లోక కల్యాణం కోసం బాబా వింత తపస్సు

ABN , Publish Date - Jun 01 , 2024 | 01:30 PM

లోక కల్యాణం కోసం ఎండ తీవ్రత తగ్గడం కోసం ఢిల్లీలో వింత తపస్సు ఓ బాబా వింత తపస్సు చేస్తున్నారు. ఢిల్లీ కుతుబ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంతంలో కత్వారియా సరాయ్ వద్ద గురు గోరఖ్‌నాథ్ మఠంలో వింత యజ్ఞం జరుగుతోంది. 21 అగ్ని గుండాల మధ్య భీకర వేడిలో కూర్చుని బాలయోగి బాలక్‌నాథ్ బాబా తపస్సు చేస్తున్నారు.

Viral News: లోక కల్యాణం కోసం బాబా వింత తపస్సు

ఢిల్లీ: లోక కల్యాణం కోసం ఎండ తీవ్రత తగ్గడం కోసం ఢిల్లీలో వింత తపస్సు ఓ బాబా వింత తపస్సు చేస్తున్నారు. ఢిల్లీ కుతుబ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంతంలో కత్వారియా సరాయ్ వద్ద గురు గోరఖ్‌నాథ్ మఠంలో వింత యజ్ఞం జరుగుతోంది. 21 అగ్ని గుండాల మధ్య భీకర వేడిలో కూర్చుని బాలయోగి బాలక్‌నాథ్ బాబా తపస్సు చేస్తున్నారు. ఎండ వేడి తగ్గాలని విశ్వ కల్యాణం కోసం 41 రోజుల పాటు బాలయోగి బాలక్‌నాథ్ బాబా దీక్ష చేపట్టారు.

Hyderabad: సినిమా షూటింగ్‌లు లేక.. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఏం చేశాడో తెలిస్తే..


రోళ్లు పగిలే ఎండలోనూ11 రోజులుగా అగ్ని గుండాల మధ్య కూర్చొని బాబా తపస్సు చేయడం విశేషం. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అగ్ని గుండాల మధ్య బాబా ఉండనున్నారు. గత 11 సంవత్సరాలుగా ప్రతి ఎండా కాలం ఎండలో ఈ తపస్సును బాలయోగి బాలక్‌నాథ్ బాబా చేస్తున్నారు. బాబా తపస్సు గురించి తెలుసుకున్న స్థానిక ప్రాంత వాసులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

Lok Sabha Elections: మోదీ బాటలోనే..

For Latest News and National News click here

Updated Date - Jun 01 , 2024 | 03:07 PM