ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kangana Ranaut: అడ్డం తిరిగిన కథ.. పాపం కంగనా రనౌత్

ABN, Publish Date - May 05 , 2024 | 08:50 PM

ఒక్కోసారి పొలిటీషియన్స్ ఎగ్జైట్‌మెంట్‌లో ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదో అనేస్తుంటారు. కొన్నిసార్లైతే.. ప్రత్యర్థిని టార్గెట్ చేయబోయి, సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. బడా నాయకులు సైతం ఇలా...

ఒక్కోసారి పొలిటీషియన్స్ ఎగ్జైట్‌మెంట్‌లో ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదో అనేస్తుంటారు. కొన్నిసార్లైతే.. ప్రత్యర్థిని టార్గెట్ చేయబోయి, సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. బడా నాయకులు సైతం ఇలా నోరుజారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేరిపోయింది. ప్రతిపక్ష నాయకుడ్ని టార్గెట్ చేయబోయి, సొంత పార్టీ నేతనే విమర్శించింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.


కాంగ్రెస్ పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతోంది

ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగనా ప్రసంగిస్తూ.. ‘‘చెడిపోయిన యువరాజులు ఉన్న ఓ పార్టీ ఉంది. వారే.. చంద్రునిపై బంగాళదుంపలు పండించాలనుకునే రాహుల్ గాంధీ (Rahul Gandhi), గూండాయిజం చేయడంతో పాటు చేపలు తినే తేజస్వి సూర్య (Tejasvi Surya)’’ అని పేర్కొంది. నిజానికి.. ఇక్కడ ఆమె తేజస్వి ఆర్జేడీ నాయకుడు, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను (Tejashwi Yadav) టార్గెట్ చేయబోయింది. ఇటీవల ఆయన చేపలు తింటున్నట్టు వైరల్ అయిన వీడియో హాట్ టాపిక్‌గా మారడంతో.. దానిని ఉద్దేశిస్తూ తేజస్వి యాదవ్‌ని తూర్పారపట్టాలని అనుకుంది. కానీ.. పొరపాటున కర్ణాటకలోని బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అయిన తేజస్వి సూర్య పేరుని ప్రస్తావించింది. ఇద్దరి పేర్లలోనూ తేజస్వి అనే పదం కామన్‌గా ఉండటంతో.. కన్ఫ్యూజ్ అయ్యింది.

ఆ హీరోని చంపింది కసబ్ కాదు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

మరోవైపు.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. కంగనా వీడియోని రీట్వీట్ చేస్తే.. ‘‘అసలు ఎవరీ మహిళ?’’ అని ప్రశ్నించారు. అటు.. ట్రోలర్స్ కూడా ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ‘‘నేనేం పాపం చేశానని నా మీద ఎగబడ్డావ్’’ అని తేజస్వి సూర్య ఫీల్ అయినట్టు.. రకరకాల మీమ్స్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ వాళ్లు సైతం ధీటుగానే బదులిస్తున్నారు. తప్పులు చేయడం మానవ సహజమని, పేర్లు కాస్త ఒకేలా ఉండటంతో ఆమె గందరగోళానికి గురై ఉంటుందని.. కంగనాకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 05 , 2024 | 08:51 PM

Advertising
Advertising