ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

After Dussehra: దసరా తర్వాత సీఎం రాజీనామా.. బీజేపీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 07 , 2024 | 07:10 AM

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సీఎం సిద్ధరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దసరా తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

karnataka cm siddaramaiah

కర్ణాటక(karnataka)లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) రాజీనామాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూకేటాయింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య దసరా తర్వాత రాజీనామా చేయవచ్చని ఆయన ఆదివారం అన్నారు. మా పాదయాత్ర ముగిసిన వెంటనే, కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. దసరా తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బెంగళూరు నుంచి మైసూర్ వరకు పాదయాత్ర చేపట్టింది.


ఢిల్లీకి ఎందుకు

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రాజీనామా అంశాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిశీలిస్తోందని విజయేంద్ర అన్నారు. ఈ విషయం సిద్దరామయ్యకు కూడా తెలుసని చెప్పారు. అందుకే తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్ధరామయ్య రోజూ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. కానీ సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీని ఢిల్లీకి ఎందుకు పంపారని ప్రశ్నించారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని ఈ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు.


కుమారస్వామి కూడా..

చన్నపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి ఈ అంశంపై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గరపడుతున్నాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల కోసం 2028 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ దుష్ప్రవర్తన కారణంగా ముందుగా ఎన్నికలు కూడా రావచ్చన్నారు. వారు చేయకూడని పనులు చేసినందున వారి పాపం కుండ నిండిపోయిందని వ్యాఖ్యానించారు. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.


ముడా స్కాం ఏంటి

ముడా స్కాం 2010లో ముఖ్యమంత్రి భార్య పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కానుకగా ఇచ్చిన 3.2 ఎకరాల భూమికి సంబంధించినది. ఈ భూమిని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత పార్వతి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆమెకు 14 ప్లాట్లు కేటాయించారు. ఈ కేసులో ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు మేరకు సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. దీనిని సిద్ధరామయ్య హైకోర్టులో సవాలు చేశారు.

ఎఫ్ఐఆర్ నమోదు

కానీ కర్నాటక హైకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబానికి నేరుగా ప్రయోజనం చేకూర్చే విషయంలో దర్యాప్తు అవసరమని పేర్కొంది. ఈ కేసులో లోకాయుక్త పోలీసులు సీఎం సిద్ధరామయ్యపై భారతీయ శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టంలోని అనేక సెక్షన్లతో సహా అనేక తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. వారు మనీలాండరింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More National News and Latest Telugu News

Updated Date - Oct 07 , 2024 | 08:23 AM