ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: ఎలక్టోరల్ బాండ్లతో మోదీ ప్రభుత్వం స్కామ్ చేసింది: కాంగ్రెస్

ABN, Publish Date - Feb 15 , 2024 | 02:23 PM

ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్దం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాచార హక్కు, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను ఎలక్టోరల్ బాండ్స్ ఉల్లంఘిస్తున్నాయని జస్టిస్ చంద్రచూద్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ పడింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇఛ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.

ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్దం అని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ సమాచార హక్కు, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని జస్టిస్ చంద్రచూద్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే రాజకీయ పార్టీలకు సంస్థలు ఇచ్చే విరాళాలు అనే సంగతి తెలిసిందే. 2017-18లో వీటిని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్లపై గతేడాది అక్టోబర్ 31వ తేదీన సుప్రీంకోర్టులో (Supreme Court) కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సీపీఐ (ఎం), ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ కేసుపై ఈ రోజు తీర్పు వెలువరించింది.

Ts Politics: ఆ నాలుగు నగరాల పేర్లు మార్చండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే

వెల్ కం

సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు అవినీతి మయం అని మరోసారి రుజువు అయ్యిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ కమీషన్లు, లంచం తీసుకుందని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ రోజు నిరూపితం అయ్యిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆశాకిరణం

‘సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, పౌరులకు ఆశాకిరణం నిలుస్తోంది. అరుణ్ జైట్లీ ఆలోచనతో ఎలక్టోరల్ బాండ్స్ పథకం రూపొందింది. ఇది బీజేపీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వస్తాయని అందరికీ తెలుసు. కార్పొరేట్ రంగానికి బీజేపీకి ఉన్న సంబంధాలతో అత్యధిక విరాళాలు అందుకుంది. ఐదు సంవత్సరాలుగా బీజేపీ అందుకున్న విరాళాలు రూ. 5 నుంచి రూ. 6 వేల కోట్లుగా ఉంటుంది. విరాళాలు ఇచ్చిన వారికి మేలు జరిగి ఉంటుంది. ఇది ఒకవిధంగా క్విడ్ ప్రోకో లాంటిదే. క్విడ్ ప్రోకో లేకుండా ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పరు. ఇది ముమ్మాటికీ మోడీ ప్రభుత్వ స్కామ్ అని’ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ధ్వజమెత్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 02:23 PM

Advertising
Advertising