Share News

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

ABN , Publish Date - Oct 13 , 2024 | 10:04 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందని వారని సమాచారం. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

ముంబయి, సెప్టెంబర్ 13: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందని వారని సమాచారం. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉందనే విషయాన్ని మాత్రం వాళ్లు ప్రకటించ లేదు.


మరోవైపు బాలీవుడ్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్‌తో బాబా సిద్దిఖీ అత్యంత సన్నిహితంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబా సిద్దిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 15 రోజుల క్రితమే.. తనకు ప్రాణ హాని ఉందని వై కేటగిరి భద్రత కల్పించాలని బాబా సిద్దిఖీ ప్రభుత్వాన్ని 15 రోజుల క్రితమే కోరారని ఆయన సన్నిహితులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే తనకు ఏ గ్యాంగ్‌తో ప్రాణ హాని ఉందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించ లేదన్నారు. మరోవైపు ఈ హత్య కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.


salman.jpg

సల్మాన్, షారుఖ్ మధ్యలో బాబా సిద్దిఖీ..

బాలీవుడ్‌లో హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇది కొన్నేళ్ల పాటు నడిచింది. అయితే మళ్లీ వీరిద్దిరని కలపడంలో మాజీ మంత్రి బాబా సిద్దిఖీ కీలకంగా వ్యవహరించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 2008లో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో నాటి నుంచి వీరిద్దరు ఎడ ముఖం పెడ ముఖంగా ఉంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే 2013లో బాబా సిద్దిఖీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా ఇద్దరు ఖాన్‌లను ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఈ విందుకు హాజరైన సల్మాన్, షారుఖ్‌లను సిద్దిఖీ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేలా చేశారు. దాంతో వారిద్దరు.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఓ చిత్రం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 13 , 2024 | 02:59 PM