ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: రైలు పట్టాలపై షాకింగ్ సీన్.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలో..

ABN, Publish Date - Jun 13 , 2024 | 08:38 PM

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పట్టాలు దాటుతూ కొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కుతూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి...

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పట్టాలు దాటుతూ కొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కుతూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తున్నా.. చాలా మంది వాహనాదారుల్లో మార్పు రావడం లేదు. రైలు పట్టాలు దాటే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ రిక్షావాలా రైలు పట్టాలు దాటుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో (Bangladesh) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ నగరంలో రైలు పట్టాల మీద నుంచి వాహనాలు అటూ, ఇటూ దాటుతుంటాయి. అయితే ఇంతలో రైలు వచ్చే సమయం కావడంతో చాలా మంది తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుకొని ఉంటారు. అయితే ఓ రిక్షావాలా మాత్రం రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తాడు. తీరా పట్టాలు దాటుకునే సమయంలో రిక్షా టైరు పట్టాల మధ్యలో ఇరుక్కుపోతుంది. చూస్తుండగానే రైలు దూసుకొస్తుంది. రైలు సమీపానికి రావడాన్ని గమనించిన రిక్షా డ్రైవర్.. ఎలాగైనా తన వాహనాన్ని పక్కకు లాగాలని ప్రయత్నిస్తాడు. అయితే అది సాధ్యం కాదు.

Viral video: ఓరి దీని వేషాలో..! మాంసం కోసం ఎలుగుబంటి ఎదుట ఈ తోడేలు విన్యాసాలు చూస్తే..


అంతలోనే రైలు వేగంగా వచ్చి రిక్షాను (train hit rickshaw) ఢీకొని వెళ్లిపోతుంది. దీంతో రైలు పట్టాలకు రెండు వైపులా ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అవుతారు. రైలు ఢీకొనడంతో రిక్షా మొత్తం నుజ్జనుజ్జవుతుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న రిక్షా వద్ద అంతా ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘థ్యాంక్స్ గాడ్... ఎవరికీ ఏమీ కాలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women: యువతి పిలవడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత..

Updated Date - Jun 13 , 2024 | 08:38 PM

Advertising
Advertising