ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: కారుతో బైక్‌ను గుద్ది.. మృతదేహాన్ని 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి

ABN, Publish Date - Jul 23 , 2024 | 04:56 AM

కారులో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, బైకర్‌ ఏమయ్యాడో కూడా చూడకుండా మృతదేహాన్ని 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు ఓ కారు డ్రైవర్‌. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద జరిగింది.

  • సంగారెడ్డి జిల్లాలో ఓ కారు డ్రైవర్‌ నిర్వాకం

మునిపల్లి, జూలై 22: కారులో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, బైకర్‌ ఏమయ్యాడో కూడా చూడకుండా మృతదేహాన్ని 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు ఓ కారు డ్రైవర్‌. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద జరిగింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్‌ తండాకు చెందిన మెగావత్‌ వెంకటేశ్‌(22) మియాపూర్‌లో ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. జహీరాబాద్‌కు పని నిమిత్తం ఆదివారం బైక్‌పై వచ్చాడు.


అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో.. మునిపల్లి మండలం లింగంపల్లి శివారులో ఓ దాబా వద్ద, హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారు వెంకటేశ్‌ బైక్‌ను ఢీ కొట్టింది. కారు డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ ఆగకుండా కారును అలాగే పోనిచ్చాడు. వెంకటేశ్‌ కారు కింది భాగంలో చిక్కుకుపోయాడు. అది గమనించని రాజ్‌కుమార్‌ వెంకటేశ్‌ను మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. కంకోల్‌ టోల్‌ప్లాజా సిబ్బంది కారుకు చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని గమనించి కారును ఆపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - Jul 23 , 2024 | 04:56 AM

Advertising
Advertising
<